సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి రూ.1,06,000 జరిమానా విధించినట్టు సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేటలో నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాల తనిఖీ చేయగా పదిమంది మద్యం తాగి వాహనాలు నడపడంతో వారికి కోర్టు జరిమానా విధించిందన్నారు.