కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ల అధికారిక నివాసం రాజ్భవన్ను లోక్భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాకు పేరు మార్చారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం చర్య ప్రజా ప్రతినిధులను అవమానించటమేనని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు.