WGL: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని, ప్రసారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు.