ADB: భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గ్రామాలైన గుంజాల, రాజుల్వాడి, లీముగూడ, బుర్కపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బంది మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు బీపీ, రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.