ADB: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ 2024 క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ శ్యామల దేవి మంగళవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని పేర్కొన్నారు.