NZB: ఇందల్వాయి మండలం లోలం సర్పంచ్గా బీజేపీ బలపరిచిన రామకృష్ణ గౌడ్ గెలుపొందారు. 18 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన గంగాధర్పై విజయం సాధించారు. రామకృష్ణ గౌడ్కు 278, గంగాధరు 260 ఓట్లు వచ్చాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్య కర్తలు సంబరాల్లో మునిగి తేలారు.