WNP: సీపీఐ వందేళ్ల ఉత్సవాలను గురువారం ఆత్మకూరు మండలం మూలమల్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి మోష పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, రైతుల సమస్యలపై పోరాడటం, వారి హక్కులను కాపాడటం పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.