GDWL: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర( తిమ్మప్ప) స్వామి దేవాలయానికి ఓ భక్తుడు వెండి వస్తువులు విరాళం అందజేశాడు. మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామానికి చెందిన పారిజాతమ్మ, వెంకటేష్ దంపతులు, 250 గ్రాముల వెండి చెంబు, గ్లాసులను శనివారం ఆలయ అధికారులకు బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారిని సన్మానించారు.