JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, ప్రసాదం అందజేశారు.