KMR: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు కురవక కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘వానమ్మ రావమ్మ’ అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు. మొదట్లో వర్షం కురిసి మురిపించగా.. పత్తి, సోయా, మొక్క జొన్న, జొన్న సాగు చేశారు. రుతుపవనాల ఆలస్యంతో ఇప్పటికే వేసిన విత్తనాలకు మొలకలు రాకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు.