JGL: పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోజులు కొట్టే కొంతమంది పోలీసులకు బల్లకింద చేయి చాచకుండా కథ నడవదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పోలీస్ వ్యవస్థపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. సమాజంలో పోలీసులు చేస్తున్న అవినీతి దందాపై దృష్టి పెట్టాలన్నారు.