SKLM: కూటమి ప్రభుత్వ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనిని నెరవేర్చేందుకు వైసీపీ తరపున నిర్వహిస్తున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ, నిరుద్యోగ భృతి కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.