NRML: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన ఈరోజు నర్సాపూర్(జి)మండలంలో జరిగింది. ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు మండలంలోని గొల్లమాడ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహిస్తుండగా తిరుపతి అనే వ్యక్తి సెక్రటరీ పై బూతులు తిడుతూ విధులకు ఆటంకం కలిగించగా, వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.