SRCL: కేసులలో పారదర్శకత చూడాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం అన్నారు. సోమవారం వేములవాడ బార్ అసోసియేషన్ హాల్లో నూతనంగా నియామకమైన అడిషనల్ పిపి అవధూత రజనీకాంత్ను న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల పరిష్కారంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. న్యాయవాదులతో సమన్వయంగా ఉండాలని ఆయన అన్నారు.