MNCL: దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వృద్దుని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.