కేంద్ర హోంశాఖ ఇవాళ ఉదయం 10:45 గంటలకు కీలక సమావేశం నిర్వహించనుంది. పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.