పార్వతీపురం మండలంలోని రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదబరితంగా మారాయి. ఈ మార్గంగుండా వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.