ELR: స్పెషల్ కోర్టు ఏలూరు వారి ఉత్తర్వులు, ప్రభుత్వ జీవో నం.519, అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడానికి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్, డీపీఆర్, జిల్లా ఐటీ అధికారి, సీఐడీ అదనపు ఎస్పీ, నగరపాలక సంస్థ ఏవో లతో కలెక్టర్ కమిటీ వేశారు.