ASF: ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల ధనోరాలో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే బుధవారం తనిఖీ చేశారు. ప్రతీరోజు నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని రుచిగా వండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.