పంజాబ్ ఈ సీజన్ను ఘనంగా ఆరంభించింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో గుజరాత్ 232/5 పరుగులకే పరిమితమైంది. సాయి సుదర్శన్ (74) బట్లర్ (54), రూథర్ఫోర్డ్ (46) పోరాడినప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు.