మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ గెలుపులో యువ ఓపెనర్ ప్రతీకా రావల్ పాత్ర కూడా ఉంది. ఈ టోర్నీలో ఆమె 7 మ్యాచుల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో సెమీఫైనల్, ఫైనల్ కోసం షెఫాలి వర్మ జట్టులోకి వచ్చింది. ICC నిబంధనల ప్రకారం 15 మంది సభ్యుల జట్టుకు పతకాలు ఇస్తారు. దీంతో ప్రతీక పతకం అందుకోలేకపోయింది.