కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinder) అందిస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.
Rahul Gandhi : ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన... అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు.
జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.
మధ్యప్రదేశ్కు చెందిన నిఖితా చౌరిసియా... శివుడిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా అంగీకరించింది.
గురుగ్రామ్కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్స్టాలో 'boyfriend on rent'తో ప్రమోట్ చేస్తున్నాడు.
విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.
ప్రజల సెల్ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించాలని సిద్ధమవుతోంది వైసీపీ ప్రభుత్వం. మార్చి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు 5.65 లక్షలమంది వైసీపీ సమన్వయకర్తలు, గృహసారథులు ఇందులో పాల్గొంటారు.
స్వామి వివేకానంద (Swami Vivekananda) తొలిశంఖారావం మన (Hyderabad) హైదరాబాద్ లోనేనని (Ramakrishna Math) రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు.వివేకానంద తన జీవితంలో ఓ బహిరంగసభను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించింది భాగ్యనగరంలోనే అని కొద్దిమందికి మాత్రమే తెలుసని చెప్పారు.
US not flying any balloons:అమెరికా (america) అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ చైనా (china) నిఘా పెట్టిందని.. వాటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు (balloons) కనిపించాయని పేర్కొంది. అమెరికా బెలూన్లు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 సార్లకు (10 times) పైగా వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.
30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల (30 mlas) పనితీరు వెనకబడిందని ఏపీ సీఎం జగన్ (cm jagan) అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వేను సమావేశంలో ఆయన ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.
ముఖేశ్ గౌడ్ స్మారక 'మల్లయుద్ధ' (Mallayud'dha)'రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ( LB Stadium)ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగినయి.బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు.
No Evidence Prabhakaran Is Alive: లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) బతికే ఉన్నారని తమిళ నేషనలిస్ట్ మూమెంట్ (TNM) నేత పి.నెడుమారన్ (P.Nedurmaran) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను శ్రీలంక ఆర్మీ కొట్టిపారేసింది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక సైన్యం స్పష్టం చేసింది.
Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక... మరోసారి వాయిదా....! : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా... ఫిబ్రవరి16న జరగాల్సి ఉంది. అయితే.... అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్ని...