• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అవనిగడ్డలో జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ

కృష్ణా: జనసేన పార్టీ 2025 నూతన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావ్ అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ఆదివారం ఆవిష్కరించారు. కోసూరుపాలెం జనసేన యూత్ భోగి రెడ్డి సాంబశివరావు, కాగితాల సాంబశివరావు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ క్యాలెండర్‌ను రూపొందించారు.

January 12, 2025 / 04:35 PM IST

ఆరున్నర కేజీల బంగారం చోరీ UPDATE

కృష్ణా: రూ. 5 కోట్ల విలువైన బంగారం అపహరణ ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరున్నర కేజీల బంగారం ఉన్న బ్యాగ్‌తో జితేశ్ అనే వ్యక్తి మునగచర్ల వరకు వచ్చి కారును అక్కడ వదిలివేసి ఆటోలో నందిగామ వైపు వచ్చినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, చెక్ పోస్టుల వద్ద అతని కోసం గాలింపు చేశాస్తున్నారు.

January 12, 2025 / 04:13 PM IST

మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

KMM: అశ్వారావుపేట మండలంలో ఆర్ఎంపీ, పీఎంపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ 18వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. అనంతరం యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

January 12, 2025 / 04:09 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి పండగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, ఇతర సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమం కమిషనర్ బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని, కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించాలన్నారు.

January 12, 2025 / 04:06 PM IST

కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BDK: కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయ్యాలి అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల నూతనంగా ఎన్నికైన టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు పల్లెలే రామలక్ష్మయ్య, అశ్వారావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోదంపరుపు నాగకిషోర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జూపల్లి కోదండ వెంకట రామారావును ఎమ్మెల్యే సత్కరించారు.

January 12, 2025 / 03:56 PM IST

వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి

SKLM: ప్రధానమంత్రి నిర్దేశించిన వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ప్రజలందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని సూర్య మహల్ జంక్షన్‌లో నిర్వహించిన స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మూలపేట పోర్టు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

January 12, 2025 / 03:45 PM IST

పర్మల్ల తండాలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

నిజామాబాద్: గాంధారి మండలంలోని పర్మల్లతండాలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనవరి 26 నుంచి అందించే రైతు భరోసా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు బాలయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్, మాజీ సర్పంచ్లు ఉన్నారు.

January 12, 2025 / 03:37 PM IST

మంత్రి అచ్చెన్నను కలిసిన DMHO

SKLM: కోటబొమ్మాళిలోని నిమ్మాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని శనివారం ఆయన కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. టి.వి. బాలమురళీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లాలోని పలు విషయాలను ఇరువురు కాసేపు చర్చించారు.

January 12, 2025 / 03:26 PM IST

సరిహద్దుల్లో సారా తయారీ కేంద్రాలపై దాడులు

SKLM: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు సిరాడ, తమిలిగూడ గ్రామాల్లో అక్రమంగా తయారు చేస్తున్న సారా తయారీ కేంద్రాలపై రెండు రాష్ట్రాల అబ్కారీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆయా చోట్ల 7,400 లీటర్ల ఊట, 1,140 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. దాడుల్లో అబ్కారీ అధికారి తిరుపతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

January 12, 2025 / 03:22 PM IST

కావలి పట్టణంలో వివేకానంద జయంతి వేడుకలు

NLR: కావలి పట్టణంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… యువత వివేకానంద అడుగుజాడల్లో నడవాలన్నారు.

January 12, 2025 / 02:24 PM IST

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ: పొన్నం

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్తరేషన్ కార్డుల ప్రక్రియపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ నెల 16 నుంచి వెరిఫికేషన్, 20-24 మధ్య ప్రజాభిప్రాయ సేకరణ, 21-25 మధ్య డేటా ఎంట్రీ పూర్తి చేయాలి. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన ఉంటుంది’ అని తెలిపారు.

January 12, 2025 / 02:20 PM IST

‘సముద్ర స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి’

కృష్ణా: హంసలదీవి బీచ్ వద్ద సముద్ర స్నానం చేసేటప్పుడు పర్యాటకులు జాగ్రత్త వహించాలని మెరైన్ సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి హంసలదీవి బీచ్ వద్దకు వచ్చిన పర్యాటకులకు మెరైన్ సిబ్బంది తగు సూచనలు, సలహాలు అందించారు. సముద్ర తీరం వెంబడి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెరైన్ ఎస్ఐ పూర్ణ మాధురి, పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహించారు.

January 12, 2025 / 02:14 PM IST

బాపట్ల పట్టణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

BPT: బాపట్ల పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గులు పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన మహిళలకు రోటరీ అధ్యక్షుడు కోళ్లపూడి ఉపేంద్ర గుప్త బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి వేజండ్ల శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిట్టా శ్రీనివాసరావు ఉన్నారు.

January 12, 2025 / 02:11 PM IST

యాజలిలో పూర్వ విద్యార్థుల సమావేశం

BPT: కర్లపాలెం మండల పరిధిలోని యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం జరిగింది. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పెనుమెత్స నాగరాజు(చిన్న బాబు) ఆధ్వర్యంలో రెండు రోజులుగా పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొని అప్పటి తమ గురువులైన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

January 12, 2025 / 02:10 PM IST

యువత దేశాభివృద్ధిలో కీలకం: ఎంపీ లావు

PLD: దేశాభివృద్ధిలో కీలకం యువత అని, అలాంటి శక్తికి స్ఫూర్తి స్వామి వివేకానంద అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో ఉన్న భారతీయ యువతను ప్రసంగాలతో, రచనతో ఉత్తేజపరిచారని, ఎదిగే స్ఫూర్తిని రగిలింప చేశారన్నారు.

January 12, 2025 / 02:08 PM IST