MHBD: MPPS ఉత్తర తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హలవత్ శంకర్ గుండెపోటుతో మృతి చేందాడు. శనివారం ఉదయం ఆయన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హలవత్ శంకర్ విద్యారంగానికి అంకితభావంతో సేవలందిస్తూ, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించారని, ఆయన మరణం తీరని లోటని స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని RIO రవి తెలిపారు. శనివారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 14,607 మంది,సెకండ్ ఇయర్ విద్యార్థులు 13,943 మంది ఉన్నారని చెప్పారు.
KMM: ఖమ్మం నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఫ్రెండ్స్ క్లబ్ -2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ ప్రయత్నాలను విజయానికి తొలిమెట్టుగా మలుచుకోవాలని సూచించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా స్నేహసంబంధాలు మెరుగవుతాయని అన్నారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సీసీఐ తెలిపింది. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సీసీఐ తెలిపింది.
ప్రెగ్నెన్సీ సమయంలోనే ‘సతీ లీలావతి’ మూవీ పూర్తి చేసినట్లు నటి లావణ్య త్రిపాఠి తెలిపింది. ‘షూటింగ్లో వాంతులు అవుతున్నా లెక్కచేయకుండా, యాక్షన్ సీన్లప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేశాను. ప్రతి షెడ్యూల్ తర్వాత హెల్త్ చెకప్ చేయించుకున్నా. మొదటి బిడ్డతో సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో రెండో బిడ్డ పుట్టినప్పుడు ఈ మూవీకి పార్ట్-2 చేస్తానేమో’ అంటూ చమత్కరించింది.
CTR: పలమనేరులో శనివారం ఓ పిచ్చి కుక్క పలువురిని కరిచి గాయపరిచింది. RK వీధిలో మనుషులపై దాడి చేసింది. ఏడుగురుకు పైగా గాయపడటంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పిచ్చి కుక్కను మున్సిపల్ సిబ్బంది బందించే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి చేయడంతో కొట్టి చంపేశారు.
NTR: నందిగామ ఏసీపీ బాలగంగాధర తిలక్ కొద్ది రోజులపాటు బదిలీ అయ్యారు. గత ఏడాదిన్నరగా నందిగామ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా పనిచేసిన ఆయనను డీజీపీ కార్యాలయంలో సీఐడీ విభాగానికి అటాచ్ చేస్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లలిత కుమారిని నందిగామ ఇంచార్జ్ ఏసీపీగా నియమించారు. అనంతరం సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.
NRML: లక్ష్మణచందా మండలంలోని బోరిగాం-కంజర్ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకేయడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రునికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడుపుతున్నట్లు సమాచారం. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
NDL: ప్యాపిలి బస్టాండ్లో పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై డిపో మేనేజర్తో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చర్చించారు. వాహనాల నిలుపుదలకు తగిన స్థలం కేటాయించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
AP: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐఏ (NIA) కీలక అడుగు వేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబు తాలిబ్, పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్లపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీరిపై బీఎన్ఎస్, పేలుడు పదార్థాల చట్టం, మరియు UAPA లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉగ్ర కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతోంది.
ELR: భీమడోలు పోలీస్ స్టేషన్లో శనివారం సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమమును నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది సిబ్బంది ఆరోగ్యపరంగా మానసికపరంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి ఆస్కారం ఉంటుందని సిబ్బంది వివరించారు.
NGKL: జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు విమర్శలకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ముఖ్యంగా ‘ఏఐ’ (Al) సాంకేతికతతో ప్రత్యర్థుల పాత వీడియోలను సృష్టించి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ ‘డిజిటల్ వార్’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. కుందుర్పి మండలం మలయనూరు పర్యటనలో తన నివాసానికి పక్కా ఇల్లు లేదని కంటతడి పెట్టిన దళిత కార్యకర్త కెంచన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల కోసం వేచి చూడకుండా, తన సొంత నిధులు రూ. 2 లక్షలు వెచ్చించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
నిన్న శాసనమండలిలో YCP ఎమ్మెల్సీలు అవలంభించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు TTD బోర్డ్ మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. శ్రీవారిని అవమానించేలా ప్రవర్తించిన నేతలకు TTD నుంచి లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. జగన్ కోసం YCP సభ్యుల దైవద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చెప్పులు వేసుకుని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడమేంటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
KMM: ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో నూతన నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ దయానంద్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ టి. కర్ణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంపీవో ఏనుగు సురేష్ బాబు, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు.