తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు
TSPSC స్కాం సహా ఇతర భూ స్కాంల ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అలా వచ్చిన డబ్బును ఇతర రాష్ట్రాల సీఎంలకు ఇచ్చి తాను ప్రధాని కావాలని కలలు కన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాఫియా మోడల్ పాలన చేస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Etela Comments : పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ ఆయనను గంటపాటు విచారించారు.
జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు. చాలా మంది ఐస్ క్రీం లవర్స్ ఎక్కడికి వెళ్లి తిందామా లేదా ఆస్వాదిద్దామా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఐస్ క్రీం(ice cream) ప్రాంతాలను రేటింగ్ సహా పలు అంశాల ఆధారంగా ఇక్కడ అందిస్తున్నాము. అవేంటో మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.
కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Viral News : ఈమధ్యకాలంలో చాలా మంది ప్రయాణికులు విమానంలో రచ్చచేయడం గురించి వినే ఉంటారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఓ ప్రయాణికుడు అలానే చేశాడు. అయితే... అతని తీరుకి విసుగొచ్చి పైలెట్ ఏకంగా విమానాన్ని వెనక్కి తిప్పాడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు(Oscar award) వచ్చింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు సాంగ్(Natu natu song)కు అంతర్జాతీయ అవార్డు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలాంటి విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే ఆస్కార్ అవార్డు గ్రహీతలు అయిన కీరవాణి(Keeravani), చంద్రబోస్ (Chandrabose)లకు అలాంటి సత్కారం అందిందా?
బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్ మూవీలో గెస్ట్గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో 'జవాన్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.
Chandra Babu : కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ,హనుమాన్ జంక్షన్ పోలీసులు... ఫిబ్రవరి 20 గన్నవరం లో టీడీపీ ,వైసీపీ గొడవలకు సంబంధించి రెండు కేసులకు నిందితురాలిగా ఉన్నారు కళ్యాణి ..