• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కృష్ణాపురంలో కుట్టుమిషన్లు, స్ప్రే పంపుల పంపిణీ

KRNL: కోడుమూరు(M) కృష్ణాపురంలో మూడో విడత కుట్టుమిషన్లు, తైవాన్ స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, MLA దస్తగిరి సహకారంతో మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, రైతులు ఆధునిక పరికరాలతో దిగుబడులు పెంచుకోవాలని ఈ సందర్భంగ నాయకులు ఆకాంక్షించారు.

February 20, 2026 / 06:24 AM IST

చీటింగ్ కేసులో జైలు శిక్ష ఖరారు

NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి, ఓబులేసు అనే ఇద్దరికీ చీటింగ్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 5000 జరిమానాను బనగానపల్లె కోర్టు విధించినట్లు ఇవాళ కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

February 20, 2026 / 06:24 AM IST

‘విహార యాత్రల ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందవచ్చు’

PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు నిన్న విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందుతారని తెలిపారు. విషయాలను బాగా అవగాహన చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:23 AM IST

టికెట్లపై 6 శాతం రాయితీ

TG: సబర్బన్ ప్రయాణికులకు రైల్వే విభాగం శుభవార్త చెప్పింది. ‘రైల్‌వన్’ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకునే వారికి 6% రాయితీ అందిస్తోంది. జూలై 14 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ పరిధిలో సబర్బన్ రైళ్లు, జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

February 20, 2026 / 06:22 AM IST

ఎంపీ వేమిరెడ్డి పీఏ అని చెబుతున్న నకిలీ పీఏ అరెస్టు

NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏ అంటూ బెదిరింపులకు దిగిన నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

February 20, 2026 / 06:21 AM IST

ట్రాక్టర్ తిరగబడి యువకుడు దుర్మరణం

W.G: ఏలూరుపాడులో గురువారం జరిగిన ప్రమాదంలో తూము జాన్ సతీశ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. కలిదిండి మండలం సింగరాయిపాలెంకు చెందిన సతీశ్, చెరువు గట్టు వేస్తుండగా బ్లేడు ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఇంజిన్ కింద పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో కుటుంబంలో విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 06:20 AM IST

యాదగిరిగుట్టలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి.

February 20, 2026 / 06:20 AM IST

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SKLM: మెళియాపుట్టి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్కలి డివిజనల్ విద్యుత్ అధికారి నర్సింహ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిడ్డిమి, చాపర గ్రామీణ, పారిశ్రామిక పీడర్ల పరిధిలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు. 

February 20, 2026 / 06:20 AM IST

శోభాయమానంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

VKB: ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన మహనీయుడని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటిగారి శివరాజ్ పేర్కొన్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తా ఆంజనేయస్వామి ఆలయం వరకు శివాజీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.

February 20, 2026 / 06:19 AM IST

యానాం ఎమ్మెల్యేకు దరియాలతిప్ప రైతుల విన్నపం

కోనసీమ: దరియాలతిప్ప పరిధిలోని పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు గురువారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక న్ను కలిశారు. సాగు నీరు అందక పోవడంతో ఎదిగిన పైరు ఎండిపోయే దశకు చేరుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే అధికారులతో మాట్లాడారు. సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 06:19 AM IST

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

PPM: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి గురువారం కలక్టరేట్‌లో సివిల్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాద్యాయుల సమస్యల పరష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సంకోచించకుండా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 06:19 AM IST

కర్మల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.1 కోటి 64 లక్షల వ్యయంతో నిర్మించనున్న కర్మల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:17 AM IST

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’

KDP: ప్రొద్దుటూరు నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా భద్రత, గంజా నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

February 20, 2026 / 06:16 AM IST

కళ్యాణదుర్గంలో నిలిచిన ప్యాసింజర్ రైలు

ATP: రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు కళ్యాణదుర్గం స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. గురువారం కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలులో కొద్దిదూరం వెళ్ళాక సమస్య ఏర్పడటంతో, సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేర్చారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

February 20, 2026 / 06:16 AM IST

ALERT: దరఖాస్తులు ప్రారంభం 

TG: ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది, అగ్రికల్చర్‌కు 1,430, రెండింటికి కలిపి ఐదుగురు.. మొత్తంగా 3,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 06:15 AM IST