• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కబడ్డీ జట్టుకు కోచ్‌గా శ్రీకాంత్ రెడ్డి నియామకం

NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ నెల 19 నుంచి 23 వరకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రతిభా కనబరిచిన క్రీడాకారులు ఎంపిక చేసి పంపడం జరిగింది. ఈ జట్టుకు కోచ్‌గా శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ పాఠశాలలో PET గా నిర్వహిస్తున్నారు.

February 20, 2026 / 11:42 AM IST

దూబేపై క్రిస్ శ్రీకాంత్ ప్రశంసలు

నెదర్లాండ్స్‌పై శివమ్ దూబే తన అద్భుత ప్రదర్శన(66 రన్స్, 2 వికెట్లు)తో టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో IPLలో చూసినదాని కంటే దూబే ఆట చాలా అప్‌గ్రేడ్ అయిందంటూ క్రికెట్ దిగ్గజం క్రిస్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ టిప్స్, మ్యాచులు లేనప్పుడు ఆట మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న హోంవర్క్ అతనికి చాలా కలిసి వచ్చాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 11:42 AM IST

BREAKING: అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం

TG: అమీర్‌పేట్ మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్‌లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఈ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ ఉన్న యువకులు, పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 11:40 AM IST

పీఎన్ కాలనీలో తాగునీటి కులాయి నీరు వృధా..!

శ్రీకాకుళంలోని గుజరాతి పేట సమీపంలోని పురుషోత్తం నగర్ కాలనీలో తాగునీటి కుళాయి నుంచి నీరు వృథాగా పోతుంది. దీని మూత పాడవడంతో నీరు పైనుంచి ధారలా కారుతుంది. గత కొన్ని రోజులుగా నీరు ఇలాగే వృధాగా పోతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.

February 20, 2026 / 11:40 AM IST

‘రైతులు కార్మికులకు బకాయిలు చెల్లించాలి’

AKP: చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రైతులు కార్మికులు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడుతూ.. పీపీపీ విధానంలో డిష్టలరీ, ఇథనాల్ ఉత్పత్తి చేసే విధంగా ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలన్నారు.

February 20, 2026 / 11:39 AM IST

చిన్నారిని ఢీకొన్న కారు.. పరిస్థితి విషమం

CTR: పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు దాటుతున్న చిన్నారి (5)ని 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గాయపడ్డ చిన్నారిని ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు.

February 20, 2026 / 11:38 AM IST

ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

HYD: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. కొంపల్లి సమీపంలోని ఓ భవన నిర్మాణ స్థలంలో ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. భవన నిర్మాణ పనుల కోసం తల్లితో కలిసి వచ్చిన బాలిక, బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

February 20, 2026 / 11:38 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే దంపతులు

PDPL: శ్రీ తిరుమల తిరుపతి స్వామి వారిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

February 20, 2026 / 11:37 AM IST

‘ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల పాలిట గొప్ప వరం’

MHBD: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారురాలు తుప్పతూరి అనసూర్య ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇవాళ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇళ్లు లేని నిరుపేదల పాలిట గొప్ప వరమని అన్నారు.

February 20, 2026 / 11:37 AM IST

ఈ నెల 22న ‘టీజీసెట్’.. ఉట్నూర్‌లో ఏర్పాట్లు పూర్తి

ADB: సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ (TGCET-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉట్నూర్ లాల్ టెక్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హరిరామ్ తెలిపారు. ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లతో పాటు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు.

February 20, 2026 / 11:36 AM IST

‘అధికారం అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం’

KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించడం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.

February 20, 2026 / 11:36 AM IST

‘ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలి’

ప్రకాశం: తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామం లో పంట నమోదు వివరాలను ఏవో ప్రసాద రావు శుక్రవారం పరిశీలించారు. ఈ పంట నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సూపర్ చెక్ చేయటం జరుగుతుందని ఏవో చెప్పారు. రబీలో ఇప్పటి వరకు 17,536 ఏకరాలు ల్యాండ్ చేయటం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 11:36 AM IST

వైసీపీ నేతలతో మండలి ఛైర్మన్ భేటీ

AP: మండలి ఛైర్మన్‌ మోషెన్ రాజును కూటమి నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండలిలోకి ఫొటోలు తీసుకుని రావడాన్ని తప్పుబట్టారు. దీంతో వైసీపీ సభ్యులతో మోషన్ రాజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు YCP ఎమ్మెల్సీల పాల్గొన్నారు.

February 20, 2026 / 11:36 AM IST

పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి: ఎంపీడీవో

ASR: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని శుక్రవారం కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు హెచ్చరించారు. వ్యాపారులు, దుకాణాల ఎదుట విధిగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించాలన్నారు. దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను విక్రయించరాదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

February 20, 2026 / 11:36 AM IST

రుతువుల మార్పిడితో వర్షం కురిసే అవకాశం

BDK: మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22 న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

February 20, 2026 / 11:35 AM IST