AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో వర్షాలు పడతాయని చెప్పింది. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.