AP: త్వరలో RTCకి 1,500 ఎలక్ట్రిక్ AC బస్సులు రానున్నాయని MD ద్వారకా తిరుమలరావు చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా వాటిలోనూ ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఈ పథకం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. స్త్రీశక్తి కారణంగా పాత రూట్లు రద్దు చేసే ఆలోచన లేదని, అవసరమైతే డిమాండ్ను బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.