ఖతార్లో సమావేశమైన హమాస్ నేతలపై ఇజ్రాయెల్ హత్యాయత్నం చేయడాన్ని ఐరోపా యూనియన్ సహా పలు దేశాలు ఖండించాయి. ఈ క్రమంలోనే ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ ఇజ్రాయెల్పై ఆంక్షలను ప్రతిపాదించారు. ఆ దేశంతో వాణిజ్యాన్ని పాక్షికంగా సస్పెండు చేద్దామని సూచించారు. అయితే 27 దేశాల కూటమిలో ఎంత మంది ఈ ప్రతిపాదనలకు మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది.