AP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. రుషికొండ ప్యాలెస్పై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి సస్పెండైన.. ఉద్యోగి సాయిప్రసాద్ను విధుల్లోకి తీసుకున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.