TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవనున్నారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిసెంబర్ 7,8 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించనున్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి నల్గొండ నుంచి ప్రత్యేక విమానంలో అమరావతి చేరుకోనున్నారు.