TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు నివాసంలో సమావేశం నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆరోపణలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.