ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని మరో 474 పార్టీలపై వేటుపడింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం వంటి కారణాలతో ఈ పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది. ప్రక్షాళనలో భాగంగా గత రెండు నెలల్లో 808 పార్టీలను రద్దు చేసినట్లయింది.