కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సారి హంగ్ రూపంలో కాకుండా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజల జై కొట్టారు.
ముందు నుంచి అనుకున్నట్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగు లేని భారీ విజయాన్ని నమోదు చేసింది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గరనుంచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కొనసాగిస్తూనే ఉంది. చివరకి రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 136 సీట్లను సొంతం చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలు దక్కాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ గెలుపు ఖరారైంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీ ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఓటమి పాలైంది. ప్రధాని మోదీ, అమిత్ షా లాంటివారు వచ్చి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించినప్పటికీ అవేవీ బీజేపీకి కలిసి రాలేదు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్(Jagadish Shettar) బీజేపీ(BJP)ని వీడి కాంగ్రెస్(Congress)లో చేరారు. ప్రస్తుతం ధార్వార్-ఉపల్లి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే(MLA)గా ఎన్నికయ్యారు.
ఆరేళ్లుగా గుంతలోనే ఉంటున్న వీరికి కనీసం త్రాగునీరు కూడా లేవు. వర్షం పడ్డప్పుడు గుంతలోకి నీరు చేరి అక్కడకూడా ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు.
జేడీఎస్ ఓటమితో బీఆర్ఎస్ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు.