టొమాటో తర్వాత ఇప్పుడు అల్లం(Ginger) కూడా రేటు విషయంలో పోటీ పడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఏకంగా కిలో అల్లం ధర రూ.400కు చేరింది. బహిరంగ మార్కెట్లలో కొనసాగుతున్న ఈ ధరల పట్ల మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా రేట్లు పెరిగితే చాలిచాలని జీతంతో జీవనం ఎలా కొనసాగించాలని పలువురు వాపోతున్నారు.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం(rice) ఎగుమతులను భారతదేశం(india) విదేశాలకు నిషేధించింది. దీంతో అమెరికాలో 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ రేటు కాస్తా 50 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
మిస్ ఒరెగాన్ యూఎస్ఏ అందాల పోటీల్లో భారత సంతతి మహిళ మంజు విజయం సాధించింది. బెంగళూరులో పుట్టిన మంజు అంతరిక్ష శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె మిస్ అమెరికా 2023 పోటీలకు కూడా అర్హత సాధించింది.