టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్కి మహాంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ప్రజ్ఞానందను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు ఈ బహుమతి ఇస్తున్నానంటూ ఆయన షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారు (Electric car) బహుమతిగా ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్రితం చాలామంది ప్రజ్ఞానందకు కారు బహుమతిగా ఇవ్వమని ఆనంద్ మహీంద్రాను కోరారు. భారత చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద ఇటీవల అజర్ బైజాన్ (Azar Baijan) లో జరిగిన ఫిడే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే సంచలనాల మోత మోగిస్తున్న ప్రజ్ఞానంద తృటిలో వరల్డ్ కప్ టైటిల్ (World Cup title) కోల్పోయాడు. అయినప్పటికీ తన ప్రతిభతో యావత్ భారతావని ప్రేమాభిమానాలను గెలుచుకున్నాడు.
కాగా, ప్రజ్ఞానందకు మహీంద్రా థార్ వాహనాన్ని కానుకగా ఇవ్వాలంటూ చాలామంది నెటిజన్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కోరారు. వాటిలో ఓ పోస్టుపై మహీంద్రా స్పందించారు. ప్రజ్ఞానందకు తప్పకుండా గిప్టు అందిస్తానని, అయితే తన ఆలోచన మరోలా ఉందని వెల్లడించారు. తాను మహీంద్రా ఎక్స్ యూవీ 400 (X UV 400) ఈవీ ఎలక్ట్రిక్ కారును బహూకరిద్దామనుకుంటున్నానని తెలిపారు. “చాలాంది ప్రజ్ఞానందకు థార్ కారు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ నేను అలా అనుకోవడంలేదు. పేరెంట్స్ తమ పిల్లలను చెస్ (Chess) ఆడేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. వీడియో గేమ్స్ హవా కొనసాగుతున్న ఈ కాలంలోనూ మెదడుకు మేత లాంటి ఈ చెస్ వైపు తమ పిల్లలను నడిపించాలని భావిస్తున్నాను.
ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి ఎలాంటి మేలు చేస్తాయో, తమ పిల్లలు చదరంగం వంటి క్రీడను ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా అలాంటిదే. ఒకరకంగా ఇది మెరుగైన భవిష్యత్ కు పెట్టుబడి వంటిది. అందుకే మహీంద్రా ఎక్స్ యూవీ 400 ఈవీ కారును ప్రజ్ఞానంద అభ్యున్నతికి కారకులైన అతడి పేరెంట్స్ నాగలక్ష్మి(Nagalakshmi), రమేశ్ బాబుకు అందిస్తాను. తమ బిడ్డ అభిరుచి పట్ల అడుగడుగునా అండగా నిలిచి, అతడిని తీర్చిదిద్దిన ఆ దంపతులకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం” అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. పిల్లల అభిరుచిని పెంచే తల్లిదండ్రులకు (Parents) మద్దతు ఇవ్వడం నిజంగా అభినందనీయం’ అంటూ ఆనంద్ మహీంద్రాకు నెటిజన్లు రిప్లై చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.