సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘వెట్టయాన్’. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర యూనిట్ ‘వేట్టయాన్ ప్రివ్యూ’ పేరుతో తెలుగు టీజర్ను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున...
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్, తమిళ హీరో కార్తీల మాటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆలోచించి మాట్లాడాలని వారిపై ఫైర్ అయ్యారు కూడా. పవన్ వ్యాఖ్యలకు స్పందించిన కార్తీ.. ట్విటర్ వేదికగా క్షమించాలని కోరాడు. తాజాగా దీనిపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు. “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్కు కౌంటర్...
అత్యాచారం కేసులో మలయాళ నటుడు ఇడవేలు బాబు అరెస్ట్ అయ్యారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాబు మూవీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో.. సభ్యత్వం నిమిత్తం కలూర్లోని ఆయన ఇంటికి వెళ్లగా.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ OTT రిలీజ్పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. మూవీ థియేటర్లలో విడుదలైన 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు సదరు సంస్థతో మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. దీంతో థియేట్రికల్ రన్ జరిగిన...
స్టార్ హీరోయిన్స్ సమంత, ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్లో కనిపించారు. సమంత, వరుణ్ ధావన్ కాంబోలో సిటాడెల్ సిరీస్ రాబోతుంది. తాజాగా లండన్లో ఈ సిరీస్ ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సామ్తో పాటు ప్రియాంక కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్ ప్రియాంక నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్కు రీ...
AP: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపుదలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరల పెంపునకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు వెలువరించింది. కాగా 14 రోజుల పాటు టికెట్ ధరలను మల్టీప్లెక్స్లో రూ.135, సింగిల్ థియేటర్లలో రూ.110 పెంచుకునేలా ప్రభు...
గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ను ఉద్దేశించి నటి, యాంకర్ రష్మీ మాట్లాడిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన రష్మీ ట్వీట్ చేసింది. 2020 కంటే ముందే ఈ ఇంటర్వ్యూను ఇచ్చానని, దయచేసి ఇప్పుడు ఆ వీడియోను వాడొద్దని కోరింది. దీన్ని వైరల్ చేస్తూ నెటిజన్లను తప్పుదోవ పట్టించొద్దని పేర్కొంది. ఏదైనా విషయంలో ఓ మహిళ నో అని చెబితే.. దాన్ని గౌరవించాలని పేర్కొంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. నేటి నుంచి 29వ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా లేడీ కొరియోగ్రాఫర్పై అత్యాచారం ఆరోపణలు నేపథ్యంలో ఆయన నుంచి పోలీసులు మరింత సమాచారం ...
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్పల్లిలోని తన నివాసంలో పనిమనిషి నాయక్ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయాడు. ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతన్ని తిరుపతిలో అరెస్ట్ చేశారు.
పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్బాస్ OTT కంటెస్టెంట్ ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హర్షసాయి స్పందిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. డబ్బు కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపాడు. తన గురించి అభిమానులకు తెలుసు అని.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నాడు. ఈ కేసుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై తన లాయర్ ప...
నేడు ప్రముఖ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 1966లో వచ్చిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న మూవీతో సింగర్గా SPB ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషల్లో దాదాపు 40వేలకు పైగా పాటలు పాడారు. ETVలో ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రవేశం చేశారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు వరించాయి....
తన వ్యాఖ్యలకు హీరో కార్తీ క్షమాపణలు చెప్పడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీ బ్రదర్ హీరో సూర్య పవన్కు ధన్యవాదాలు తెలిపారు. మీ అభినందలకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ అంటూ రిప్లై ఇచ్చారు. కాగా ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు లడ్డూ ఇప్పుడు సెన్సిటివ్ విషయమని కార్తీ సమాధానం ఇవ్వగా.. లడ్డూ అనేది సెన్సిటివ్ విషయం కాద...
స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా రెండో పాటపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. Raa Macha Macha అంటూ ఈ పాట సాగుతుందని రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న అతడు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. దుబాయి లేదా అమెరికా వెళ్లినట్లు సమాచారం. కాగా పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని అత్యాచారానికి పాల్పడ్డారని బిగ్బాస్ OTT కంటెస్టెంట్ హర్షసాయిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప...