రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పాత ధరలకే టికెట్లను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పెద్ద సినిమాల విడుదల సమయంలో పదేపదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ TG ప్రభుత్వంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.