హిందువులు జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ, పార్వతులకు వివాహం జరిగిన రోజు కూడా అదే. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదిన రానుంది. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఏపీలోని ప్రముఖ శైవ క్...
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్...
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీ...
నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేప...
కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ అందుబాటులోకి టీటీడీ యాప్ అందులోకి తెచ్చింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన మొబైల్ యాప్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. టీటీడీ సేవలు, మొత్తం సమాచారం అంతా ఒక చోట ఉండే విధంగా జియో సహకారంతో ఈ కొత్త యాప్ ను రుపొంచినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా వర్చువల్ సేవలను భక...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్లు గలవారికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,221 మంది దర్శించుకున్నారు. అలాగే ...
నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...
రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రధాని మోదీ కానుక అందించారు. దర్గాకు చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు.సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఖ్వాజా మొయినుద్దీన్ ప్రముఖ సూ...
చాలా మంది ఆలయానికి వెళ్లి గుడి ప్రదక్షిణ చేస్తుంటారు. కొంత మంది ఆలయ ఆవరణలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటివల్ల వారికి కొన్ని రకాల సమస్యలు వాటిల్లుతుంటాయి. ఆలయ ఆవరణలో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల పుణ్యం దక్కకపోవడమే కాకుండా చెడు ప్రభావాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆలయ ఆవరణలో చేయకూడదని పనులు చేస్తే అరిష్టం కలగడంతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కాబట్టి ఆలయానికి వెళ్తే కొన్నిరకాల...
చాలా మంది తమ జీవితంలో కొన్ని తప్పులు చేయడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చెడుకాలం వచ్చినప్పుడు మనిషి ఏ పని చేసినా అందులో వైఫల్యం చెందడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఈ నష్టాల వెనక కొన్ని చెడు అలవాట్లే కారణం అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చే కొన్ని చెడు అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్ల...
నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా కింద అంగ ప్రదక్షిణ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయనుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ జారీ చేయడం ఆపేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22వ తేది నుంచి 28వ తేది వరకూ ఈ అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ఆపివేయనున్నట్లు [&h...
దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జనవరి 26వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణ ఏకైక శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రజాకార్ల సమయంలో జోగుళాంబ అమ్మవారి మూలవిరాట్ ను బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. 2005లో వసంత పంచమి రోజున కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయంలో ...
తెలుగు నెలల్లో కొన్ని నెలలకు ప్రత్యేకత ఉంది. అందులో చాంద్రమానం ప్రకారంగా చూస్తే పడకొండవ మాసం అయిన మాఘమాసానికి అపార విశిష్టత ఉంది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఏర్పడే మాసం కనుక దీనిని మాఘమాసం అన్నారు. అఘము అంటే పాపం అని అర్థం వస్తుంది. మాఘమాసం అంటే పాపాలను నశింపజేసేదిగా పురణాలను చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. హిందూ సంప్రదాయం ప్రకారంగా చూస...
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ భక్తులు మల్లన్న పేరి...
తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ...