IPL2024: బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

ఐపీఎల్ బ్లాక్ టికెట్లు అమ్మెవారిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐపీఎల్ టికెట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 12:48 PM IST

IPL2024: ఐపీఎల్ సీజన్ మొదలైంది అంటే అందిరికీ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం ఉంటుంది. అందుకోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్లలో పడిగాపులు గాస్తుంటారు చాలా మంది క్రికెట్ అభిమానులు. తాజాగా టికెట్లు దొరకడం లేదని కొంత మంది విద్యార్థి సంఘం నాయకులు ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. టికెట్లు అమ్మకంలో పారదర్శకత లేదంటూ బీసీసీ సీఈఓను కలవడానికి వచ్చారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు అధికారులు బ్లాక్ టికెట్ వ్యవహారం ఒకటి ఛేదించారు. అధిక ధరకు విక్రయిస్తున్న సాప్ట్‌వేర్ ఇంజినీర్‌‌ను ఆయనకు సహయపడే మరికొందరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

చదవండి:South Korea: మస్క్ పేరుతో మస్కా కొట్టిన సైబర్ నేరగాడు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లైన బెంగళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ సుశీల్‌ స్నేహితులు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు సంపాదించాలి అని భావించారు. టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టగానే ఇతరుల ఐడీలతో భారీగా టికెట్లు కొనుగోలు చేస్తారు. వాటిని తెలిసిన వాళ్ల ద్వారా మార్కెట్ చేసుకొని డిమాండ్‌ను బట్టి అమ్ముతుంటారు. ఆటను బట్టి డిమాండ్ భారీగా ఉంటుంది. ఒక్కో టికెట్ రూ. 20 వేలకు అమ్మినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. ఇక వీరి నుంచి 100 టికెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్ దందాపై పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది.

చదవండి:Kenya: భారీ వర్షాలు.. 38 మంది మృతి

Related News

Eesha Rebba: తెలుగు బ్యూటీ క్యూట్ లుక్స్ చూశారా?

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే ప్రస్తుతం ఈమె అంతగా సినిమాల్లో కనిపించడంలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.