• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పునఃప్రారంభం కానున్న ఏనుమాముల మార్కెట్

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా పంటల కొనుగోలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర ఉండాలని అధికారులు సూచించారు.

February 23, 2026 / 06:09 AM IST

రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ వాసి మృతి!

ADB: కడెం మండలం దోస్త్ నగర్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన సయ్యద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. అతను మంచిర్యాలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నిర్మల్‌లో నివాసం ఉంటున్నారు.

February 23, 2026 / 06:08 AM IST

గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

HYD: అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. మార్చి 1వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరిగి నాలుగవ తేదీన బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.

February 23, 2026 / 06:07 AM IST

విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: టేక్మాల్ మండలం బోడగట్టు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్మరికత్త, సూరంపల్లి, వేల్పూగొండ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉదయ్ భాస్కర్, ఏడీఈ వెంకటేశ్వరరావు తెలిపారు వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.

February 23, 2026 / 06:04 AM IST

డిప్యూటీ మేయర్‌కి ఛాంబర్ ఉందా లేదా?

KNR: కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది.

February 23, 2026 / 06:04 AM IST

మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య

JGL: మల్యాల మండలం బల్వంతపూర్‌లో కొను బక్కయ్య (53) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక వేదనను తట్టుకోలేక పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మరోమారు ఆదివారం గ్రామంలోని ఓ హార్వెస్టర్‌కు నైలన్ తాడుతో ఉరి వేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 06:02 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

SRCL: ముస్తాబాద్ మండలం చీకోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పర్శ శ్రావణి సీఎం కప్ జిల్లా స్థాయి రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కోచ్ రమేశ్, పాఠశాల ప్రిన్సిపల్, MEO నిమ్మల రాజిరెడ్డి, సర్పంచ్ బొమ్మేన ఆంజనేయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

February 23, 2026 / 06:02 AM IST

నేటి నుంచే ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ పరీక్షలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పరీక్షలు వెల్లడించారు.

February 23, 2026 / 05:02 AM IST

ప్రతిష్టాత్మిక అవార్డు అందుకున్న మూసాపేట్ వాసి

HYD: కూకట్‌పల్లి మూసాపేట్ డివిజన్‌కు చెందిన కర్కనాగరాజుకు అత్యంత ప్రతిష్టాత్మికమైన వరల్డ్ అచివర్స్ అవార్డ్స్ 2026కు ఇటీవలే ఎంపికయారు. ఆదివారం న్యూఢిల్లీ జనక్ పూరి హోటల్ హయత్ సెంట్రిక్‌లో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ క్రికెట్ ప్లేయర్ చేతన్ శర్మ చేతుల మీదుగా అవార్డ్‌ను అందుకున్నారు. సోషల్ సర్వీస్, ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కేటగియరీలో ఆయన ఎంపికయ్యారు.

February 22, 2026 / 09:43 PM IST

జనసేనలో పలువురి చేరిక

MDCL: కీసర(మం) దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి ఆధ్వర్యంలో ఆదివారం సాంబశివరెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనస్వాగతం పలికారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత ముందుకు రావాలన్నారు.

February 22, 2026 / 09:42 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA గాంధీ

RR: యూత్ కాలనీలో నిర్వహించిన ‘దవాత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ క్రమశిక్షణకు, మత సామరస్యానికి ప్రతీక అని, తెలంగాణలో “గంగా జమునా తెహజీబ్” సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 09:39 PM IST

హుజూర్‌నగర్ 21వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన

NLG: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. డ్రైనేజ్, వీధి దీపాలు, శానిటేషన్, వాటర్ సప్లై సమస్యలను పరిశీలించి ప్రజల అభ్యర్థనలు నమోదు చేశారు. అభివృద్ధి పనులు చేపడతామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:38 PM IST

ప్రతిభను వెలికి తీయడానికే టాలెంట్టెస్ట్

BHNG: ఆలేరులో SFI మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పోటీలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:32 PM IST

వెంకటాయపల్లి నేతలు కాంగ్రెస్‌లో చేరిక

MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో వెంకటాయపల్లి స్వతంత్ర సర్పంచ్ రామాంజనేయులు, ఉపసర్పంచ్ పింజరి మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువా కప్పి వారిని ఆహ్వానించారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 22, 2026 / 09:31 PM IST

నిజాంపేట ప్రజావాణికి కలెక్టర్ హాజరు

MDK: నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. నేరుగా ప్రజల పిర్యాదులు స్వీకరించనున్నారు.

February 22, 2026 / 09:21 PM IST