• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కాట్రపల్లిలో ఉపాధి హామీ పనులపై సమీక్ష

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి మంగళవారం ఆడిటర్లతో కలిసి సమీక్షించారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:27 PM IST

ప్రజల ఫిర్యాదులపై ఆస్పత్రి తనిఖీ: ఛైర్మన్ సారంగపాణి

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

February 24, 2026 / 07:26 PM IST

పరీక్షల నిర్వహణపై CS రామకృష్ణారావు సమీక్ష

KMM: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:26 PM IST

‘వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలి’

MNCL: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.

February 24, 2026 / 07:26 PM IST

కంటి వైద్య శిబిరం ఎర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ

SRPT: HNRలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లైసెన్స్ డ్రైవర్ల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు SI తెలిపారు. మంగళవారం ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు పరిశీలించారు. డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 07:22 PM IST

కనుముకులలో వైభవంగా వేంక‌టేశ్వ‌రుడి తిరు కళ్యాణం

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల‌ జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల‌ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.

February 24, 2026 / 07:20 PM IST

సాదా బైనామా వెంటనే అమలు చేయాలి: బీజేపీ వినతి

WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఆర్డీవో ఉషారాణికి BJP పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కోరారు.

February 24, 2026 / 07:20 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతం నుంచి చౌట్పల్లి గ్రామానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. వాసంగట్టు తండాకు చెందిన లకావత్ రాజేందర్‌ను మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 07:20 PM IST

‘పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 77 కోట్ల నిధుల మంజూరు’

NRML: లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 77 కోట్ల నిధులు మంజూరైనట్లు ముధోల్ MLA రామారావు తెలిపారు. ఈ లిఫ్ట్ ద్వారా పిప్రీ, నగర్, రాయపూర్ కాండ్లీతో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష వైఖరి మూలంగా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే జూన్ వరకు ఈ లిప్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

February 24, 2026 / 07:19 PM IST

‘మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ.40 వేలు చెల్లించాలి’

KMM: అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తిర్లాపురం సర్పంచ్ వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు ఎకరాకు రూ. 40వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

February 24, 2026 / 07:17 PM IST

‘MLA కోవ లక్ష్మీపై అక్రమ కేసును ఎత్తి వేయాలి’

ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మీపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని BRS జిల్లా నాయకులు సరస్వతీ డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. క్యాతన్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగకుండా మంత్రి వివేక్ BRS నాయకులు సుమన్, MLA కోవ లక్ష్మీలపై తప్పుడు కేసులు పెట్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజలు తీర్పును ప్రభుత్వం శిరసావహించి ఎన్నిక నిర్వహించాలన్నారు.

February 24, 2026 / 07:16 PM IST

కీసర చుట్టూర ప్రాంతాల్లో పెరిగిన ఉక్కపోత..!

MDCL: కీసర చుట్టూర ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా పెరిగింది. రెండు రోజులుగా ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో వేడి మరింత పెరిగినట్టుగా అనిపిస్తోంది. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

February 24, 2026 / 07:07 PM IST

క్రీడా మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

SDPT: నరేంద్ర మోడీ ప్రేరణతో నిర్వహిస్తున్న 2025-26 సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కోహెడ మండల బీజేపీ అధ్యక్షుడు జాలిగం రమేష్ మాట్లాడుతూ.. మార్చి 1-3 వరకు అసెంబ్లీ, 5-7 వరకు పార్లమెంట్ స్థాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, హాకీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు ఎంపీ బండి సంజయ్ బహుమతులు అందజేస్తారన్నారు.

February 24, 2026 / 07:05 PM IST

100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి: వీసీ

MBNR: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి కళాశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని PU వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఆదేశించారు. విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా కళాశాలలు కృషి చేయాలని ఆయన సూచించారు.

February 24, 2026 / 07:05 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నేతలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నేత శ్రీరాముల రామచంద్రం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:04 PM IST