• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టెక్నీషియన్‌లు లేక మూలన పడ్డ స్కానింగ్, X రే యంత్రాలు

ASF: తిర్యాణి ఆసుపత్రిలో స్కానింగ్, X రే యంత్రాలు ఉన్నా సిబ్బంది లేక అవి మూలపడ్డాయి. దీంతో గిరిజనులు, గర్భిణులు పరీక్షల కోసం 60KM దూరంలోని మంచిర్యాల లేదా ఆసిఫాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం లక్షలు వెచ్చించి యంత్రాలను సమకూర్చినా, నిర్వహణ కరువవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి టెక్నీషియన్లను నియమించాలన్నారు.

February 21, 2026 / 10:18 AM IST

కొండపోచమ్మ కెనాల్ నుంచి హల్దీ వాగులోకి సాగునీరు విడుదల

SDPT: వివిధ గ్రామాల రైతుల కోరిక మేరకు గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కొండపోచమ్మ కెనాల్ నుంచి హల్దీ వాగులోకి సాగునీరు విడుదల చేశారు. వర్గల్ నవోదయ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతు రుణమాఫీ, భరోసా, మద్దతు ధర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ విజయ మోహన్, నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 10:15 AM IST

తిరోగమనంలో జన్నారం మండల అభివృద్ధి

MNCL: కవ్వాల్ అభయారణ్యం పరిరక్షణ కోసం బిగించిన ఆంక్షలతో జన్నారం అభివృద్ధికి దూరంగా ఉంది. కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉండగా.. కవ్వాల్ అభయారణ్యంతో పాటు వన్యప్రాణులు, పక్షుల రక్షణకు ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వన్యప్రాణి చట్టం నిబంధనలు అడ్డువస్తున్నాయి.

February 21, 2026 / 10:13 AM IST

కాకునూర్ గ్రామంలో బండలాగుడు పోటీలు

RR: కాకునూర్‌లోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, గంటలతో అందంగా అలంకరించి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.

February 21, 2026 / 10:13 AM IST

SRR కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన

KNR: కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ కళాశాలలోని ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (EDC) ఆధ్వర్యంలో ఎంటర్ప్రైన్యూర్షిప్ స్ఫూర్తిని పెంపొందించడంపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా ఆలోచించాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST

‘వ్యాయామం నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి’

SRCL: వాకింగ్, వ్యాయామం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 10:05 AM IST

ఉరివేసుకుని ట్రాక్టర్ డ్రైవర్ మృతి

BDK: అశ్వాపురం మండలం మండికుంట గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ శనివారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సీఐ అశోక్ రెడ్డి ఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 10:05 AM IST

మంత్రి పొంగులేటి చొరవతో కిడ్నీ బాధితుడికి LOC

KMM: పొన్నెకల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేదకు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఎల్వోసీ మంజూరు చేయించి కొండంత భరోసా ఇచ్చారు. తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం రాత్రి లబ్ధిదారులకు LOC పత్రాని అందజేశారు.

February 21, 2026 / 10:05 AM IST

స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 129 మంది

RR: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న షాద్‌నగర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 129 మంది స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 10:04 AM IST

గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

ASF: లింగాపూర్ మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై SI గంగన్న నేతృత్వంలో శనివారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 2 లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 21, 2026 / 10:00 AM IST

నేడు విద్యుత్ అంతరాయం

KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు, కాచాపూర్ సబ్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల దృష్ట్యా కొత్తగట్టు, లింగాపూర్, గొల్లపల్లి, కల్వల, రాజాపూర్, కాచాపూర్ గ్రామాల్లో విద్యుత్ కోత ఉంటుందని ఏఈ రఘు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 10:00 AM IST

సీఎం కప్ పోటీలలో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులు

NRML: సీఎం కప్ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి నేడు మూడు కాంస్య పతకాలు సాధించారు. తైక్వాండో విభాగంలో నేహల్, జోయా, శ్రీహంష్ తమ ప్రతిభతో కాంస్య పతకాలు గెలుచుకుని జిల్లాకు గర్వకారణమయ్యారు. వీరికి శిక్షణ అందించిన కోచ్ వంశీ కృష్ణ కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

February 21, 2026 / 09:54 AM IST

కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు

SDPT: చేర్యాల పట్టణం అన్ని వార్డులో కోతులు సంచరిస్తూ పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లపై గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

February 21, 2026 / 09:51 AM IST

గడ్డి మిషన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

SRPT: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈ నెల 9వ తేదీన నాగరాజు విషయం తాగాడు. ఖమ్మంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

February 21, 2026 / 09:50 AM IST

కాళ్లకల్లో విద్యుత్ శాఖ ప్రజాబాట

MDK: విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా శనివారం మనోహరాబాద్ మండల పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజా బాట కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 09:48 AM IST