• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో పొన్నం కీలక పాత్ర

SDPT: తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ క్రియా శ్రీలంక పాత్ర పోషించారు. 2009-2014 మధ్య కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించారు. ‘సకల జనుల సమ్మె’, మిలియన్ మార్చ్‌లో పాల్గొంటూ, పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారుడుగా నిలిచారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతున్నప్పుడు గాయపడ్డారు.

February 20, 2026 / 02:56 PM IST

‘తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి’

MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ ఉద్యమాకారుల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత ఉద్యమకారులదన్నారు. గుర్తింపు కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల ఎక్స్‌గ్రేషియా తదితర హామీలు అమలు చేయాలన్నారు.

February 20, 2026 / 02:52 PM IST

‘మధిర పట్టణాన్ని ప్రగతి వైపు నడిపిస్తాం’

KMM: మధిర ప్రజలకు కావాల్సిన వైద్యం, రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మధిర పట్టణాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తానని మధిర మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత రామనాథం అన్నారు. 3 వార్డు కౌన్సిలర్ బెజ్జం రాజు శుక్రవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ సామినేని సుజాతని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

February 20, 2026 / 02:47 PM IST

నిజామాబాద్ చేరుకున్న మంత్రి పొన్నం, మహేశ్ కుమార్ గౌడ్

NZB: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానానికి చేరుకున్న వారికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు పాల్గొని నేతలకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.

February 20, 2026 / 02:47 PM IST

గట్టుప్పల్‌లో బెల్ట్ షాపులపై కఠిన చర్యలు

NLG: గట్టుప్పల్ మండలంలో బెల్ట్ షాపులు, నాటు సారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంజీవరెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల వరకు బైండోవర్ చర్యలు ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 02:42 PM IST

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

MHBD: తొర్రూరు మండలంలోని జమస్తాన్ పురం శివారు సుందర్ నాయక్ తండాకు చెందిన నేతావత్ రవి అనే వ్యక్తి నిన్న పాడి గేదెలకు నీళ్లు తాగించేందుకు ఆకేరు వాగు వద్దకు తోలుకెళ్లగా, ప్రమాదవశాత్తు అదే వాగు గుంతలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. వారి మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.

February 20, 2026 / 02:40 PM IST

వనపర్తి పురపాలక పీఠంపై మాధవి బాధ్యతల స్వీకరణ

WNP: వనపర్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మిడిదొడ్డి మాధవి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్, నూతన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:38 PM IST

తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు

SRPT: తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు నిర్వహించడం ఆనవాయితీ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మాట్లాడారు. శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

February 20, 2026 / 02:37 PM IST

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

SRCL: చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శుక్రవారం భూమి పూజా చేశారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఆలయ నిర్మాణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు భారతి నగేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలోని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం

RR: షాద్‌నగర్ మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుతీరిన వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు నూతన పాలకవర్గం శాలువతో సత్కరించి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎల్లప్పుడూ వెంట ఉండి ముందుకు నడిపించడంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు, పాలక వర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఆనందం వెళ్లి విరిసింది.

February 20, 2026 / 02:36 PM IST

విఠల్ రెడ్డి చొరవతో దాగం రోడ్డుకు మోక్షం

NRML: తానూరు మండలంలోని దాగం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధికారుతో మాట్లాడి గ్రావెల్ రోడ్డు మంజూరు చేయించారు. ఇందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు విఠల్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

February 20, 2026 / 02:35 PM IST

ఏసీబీకి చిక్కిన కోర్డు సిబ్బంది

BHPL: జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.5 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్) రజిత, కొమ్ము సునీతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఏసీబీని ఆశ్రయించారు.

February 20, 2026 / 02:35 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు హర్షిత ఎంపిక

MNCL: రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలకు తాండూర్ మండలం అచ్చలాపూర్ ZPHS విద్యార్థిని చౌల్ల హర్షిత ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో హర్షిత బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయిందన్నారు. ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో హర్షిత పాల్గొంటుందన్నారు.

February 20, 2026 / 02:35 PM IST

సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్

WGL: గీసుకొండ(M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో రెండో విడత సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో ఇవాళ అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల నెలకొన్న సమస్యలు పరిష్కరించి సూచించారు. ఈ కార్యక్రమంలో మెరుగు సుమలత పాల్గొన్నారు.

February 20, 2026 / 02:34 PM IST

అగ్నివీర్ పరీక్షలకు ఉచిత శిక్షణ: కలెక్టర్

PDPL: జిల్లాలో అగ్నివీర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష శుక్రవారం తెలిపారు. ఈనెల 23లోపు అభ్యర్థులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈనెల 25న మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. మే 31 వరకు శిక్షణ ఉంటుందని, టెన్త్ పాసైన 17.5-22 సంవత్సరాల మధ్య వయసుగల పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

February 20, 2026 / 02:34 PM IST