NLG: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు.
BDK: రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, పలు అంశాలపై అవగాహన, పోలీసులు ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమము ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
MHBD: రాష్ట్రంలో వచ్చేది BRS ప్రభుత్వమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలు వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సరికాదన్నారు.
‘PS 2’లోని ‘వీర రాజా వీర’ సాంగ్కు డగర్ బ్రదర్స్కు క్రెడిట్ ఇవ్వడానికి AR రెహమాన్ సుప్రీంకోర్టులో అంగీకరించాడు. 5వారాల్లోపు SM, OTTలలో సవరించిన క్రెడిట్లు కనిపించాలని కోర్టు ఆదేశించింది. ‘శివస్తుతి’ నుంచి ఈ పాటను కాపీ చేశారని డగర్ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో డగర్వాణీ ధ్రుపద్ సంప్రదాయం పేరుతో క్రెడిట్స్ ఇచ్చేందుకు రెహమాన్ ఓకే చెప్పాడు.
SRD: జహీరాబాద్ నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఖాళీగా ఉన్న 500 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. అభ్యర్థులు ధృవీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్నమయ్య: రాయచోటిలో కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నసీర్ను సంయుక్త పోలీస్ ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. అతనిపై 26 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ చర్యలో అన్నమయ్య ఎస్పీ ధీరజ్ చొరవకు ప్రశంసలు లభించాయి. స్థానికంగా తప్పుడు పేరుతో నివసిస్తున్నట్టు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE)లో 3 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గల 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుండగా.. జీతంగా నెలకు రూ.57,700-1,82,400 చెల్లిస్తారు.
TPT: తిరుపతి నగరంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఈఈసీ గంగాధరరెడ్డి తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు న్యూమారుతీ నగర్, అమరావతి నగర్, ఎల్బీ నగర్, మహిళా యూనివర్సిటీ ఏరియా, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ వి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని టాస్క్ కో ఆర్డినేటర్ జె.శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
GNTR: చేబ్రోలు మండల పరిధిలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు MLA ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చొప్పున, మొత్తం రూ. 6 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
దేశవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థుల నుంచి యువ విజ్ఞాన కార్యక్రమానికి (యువిక) ఇస్రో దరఖాస్తులు స్వీకరిస్తోంది. వైజ్ఞానిక శాస్త్రంతో పాటు అంతరిక్ష పరిజ్ఞానంపై క్విజ్ రూపంలో పిల్లలను అధికారులు పరీక్షిస్తారు. దీనికి ఈనెల 27 నుంచి మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు శుక్రవారం వెలుగుచూసింది. అడవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వస్తుండగా రోడ్డుపై భారీ పరిమాణంలో ఉన్న ఈ తాబేలును గుర్తించారు.
TPT: తొట్టంబేడు 2 టౌన్ పరిధి చెన్నై రోడ్డులోని MGM ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె ఆచూకీ తెలిసినవారు శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నక్కపల్లి మండలానికి చెందిన కొల్లి సురేంద్ర(19) ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.