GNTR: గుంటూరు నగరాన్ని వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిపి “జీరో లిట్టర్” నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం ఉద్యోగ నగర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డులపై భారం తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు
ప్రకాశం: త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్లో ప్రకాశం జిల్లాకు అధిక సంఖ్యలో పోస్టులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరారు. శనివారం ఈ మేరకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.
TG: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ సీటు వివాదం ముదురుతోంది. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో బాల్క సుమన్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. BRS కౌన్సిలర్ భూమయ్య గౌడ్ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారని.. అధికారులు కూల్చేసేందుకు రావడంతో.. ఉద్రిక్తత మరింత పెరిగింది. మంత్రి వివేక్ నీచ రాజకీయాలు చేస్తున్నారని BRS నేతలు ఆరోపిస్తున్నారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్కు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను, ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: డోకిపర్రు గ్రామ పరిధిలోని జడ్పీ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, బాల బాలికల రక్షణ, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాల వ్యతిరేకత, సైబర్ మోసాలపై గుడ్లవల్లేరు ఎస్సై ఎన్.వి.వి. సత్యనారాయణ వివరించారు. అత్యవసరాలకు 112, సైబర్ నేరాలకు 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
GNTR: మేడికొండూరు మండలంలోని పేరేచర్ల భారీ గృహ లేఅవుట్ను కలెక్టర్ అన్సారియా శనివారం సందర్శించారు. మొత్తం 18,090 ఇళ్లలో, 9,600 అర్బన్ గృహాలు ఉన్నాయని.. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
TPT: చెత్త రహిత, సుందర తిరుపతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ దండి మార్చ్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోర్ బిన్ సిస్టం ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ-వేస్ట్గా చెత్తను వేరు చేయాలని సూచించారు.
SKLM: అంగన్వాడీలు సమయపాలన పాటించాలని మందస సీడీపీవోపీ అరుణ అన్నారు. శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం అమలు జరపాలని సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులకు ఈ కేవైసీ, ఆధార్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టేక్ హోమ్ రేషన్ శత శాతం అమలు జరపాలని సూచించారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపూర్లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. కౌన్సిలర్ బండ్లగూడ ప్రశాంత్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
VSP: డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా రంగాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సెంట్రల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. సుమారు 55 మంది అభ్యర్థులు పాల్గొనగా, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహింవారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు దాసరి కాలనీలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
PPM: సీతానగరం పెదభోగిల పంచాయతీ సుంకరవీధిలో శనివారం డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో సంచార వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్ పరీక్షల అనంతరం ప్రతి నెల ఏ మేరకు మెరుగవుతుందో పరిశీలించారు. అనంతరం వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు.
శ్రీవారి భక్తుల మనోభావాలను అందరూ గౌరవించాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అసెంబ్లీలోకి స్వామివారి ఫొటోలు తీసుకురావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దేవుడి చిత్రపటాలను అవమానపరచకూడదని, ఇది భక్తుల నమ్మకాలకు సంబంధించిన విషయమని హితువు పలికారు. ముఖ్యంగా ప్రసాదాల నాణ్యత, పవిత్రత విషయంలో భక్తుల్లో పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
NRML: ప్రజలు అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కడెం ఎస్సై సాయికిరణ్ సూచించారు. కడెం మండలంలోని అంబర్పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో అపరిచితుల గురించి సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.