SRD: సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్లో నూతన సర్పంచులు, కార్యదర్శులకు శనివారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో శారద నూతన సర్పంచులకు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. జీపీ గ్రామసభ, సాధారణ సమావేశం, తీర్మానం, కార్యదర్శిలతో సమన్వయంపై సూచనలు ఇచ్చారు. సంగారెడ్డిలో ఈనెల 23 నుంచి జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులకు సర్పంచులు వెళ్లాలని సూచించారు.
కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద శనివారం లారీ ఢీకొని కేసర్ల హేమసుందర్ (56) మృతి చెందారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు కేసర్ల పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
W.G: తణుకు సజ్జాపురం మహాలక్ష్మి నగర్ లోని ఖాళీ స్థలాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ స్థలంలోని పిచ్చిమొక్కలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
BDK: తెలంగాణ ఉద్యమకారుడు మణుగూరు మండల పరిధిలోని 220 కెవి సబ్ స్టేషన్ ప్రాంత నివాసి అక్కినపల్లి సైదులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సైదులు ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను చరవాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు.
HYD: చంచల్ గూడ కేంద్ర కారగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్, ఉప్పల వెంకటేష్ గుప్తా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ పై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.
KNR: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.
KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాగముని, పూర్ణచంద్రరావు శనివారం తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని శిథిలావస్థమైన తరగతి గదులను సందర్శించి, పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులను ఆరా తీశారు.
MDK: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్త వాహించాలని సూచించారు.
JGL: ధర్మపురిలో మార్చి 8 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కుంగ్-పూ&కరాటే పోటీల పోస్టర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభ వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
అమెరికా సుప్రీంకోర్టు.. సుంకాలపై ఇచ్చిన తీర్పుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ‘దేశ దిగుమతులను నియంత్రించే సామర్థ్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి కట్టబెట్టినప్పటికీ.. సుప్రీం తీర్పుతో అది జరగకుండా పోతోంది. ఇది చట్టవిరుద్ధమైన తీర్పు. దీనివల్ల అమెరికా పరిశ్రమలు, సరఫరా గొలుసును అధ్యక్షుడు పరిరక్షించే అవకాశం కష్టతరంగా మారనుంది’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కుటుంబానికి BJP అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
VKB: వికారాబాద్లో వైసీసీ అధ్యక్షుడు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
PDPL: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: నీటిని పొదుపుగా వాడుకోవడం అందరి బాధ్యత అని జలమండలి ఎండి అశోక్ రెడ్డి అన్నారు. జలమండలి బస్తిబాట కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలన్నారు.
VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.