ATP: గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. ధర్మవరానికి చెందిన శారద తన బంధువులతో కలిసి యాదగిరి వెళ్తుండగా బీదర్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగం తగ్గడంతో గుర్తుతెలియని దొంగ.. ఆమె మెడలోని మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు రైలు చైన్ లాగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
NGKL: కుమ్మర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో బీసీ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని TRP చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు.
SRPT: ప్రజల ప్రాణ పత్రిక లక్ష్యంగా నేటి నుంచి వారం రోజులపాటు సూర్యాపేట జిల్లాలో రెండో దశ అర్తెవ్ అల్తెవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించడం, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.
TG: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
కోనసీమ: కాంగ్రెస్ నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఆదివారం సాయంత్రం బీజేపీ యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి సృష్టించిన అల్లర్లను ఖండిస్తూ నిరసన చేపట్టామన్నారు.
చండీగఢ్లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్లో రూ.590 కోట్ల భారీ మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాతాలో ఈ గోల్మాల్ చోటుచేసుకుంది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హర్యానా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని సమాచారం.
KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ అంశం మరింత జఠిలంగా మారడంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణల వరకు వెళ్లింది. తాజాగా ఈ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. మరోవైపు శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉభయసభలను కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తుంది. శాసనసభకు వైసీపీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టుపట్టనుంది.
W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో రూ .23,16,107 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆచంట నియోజకవర్గంలో రూ. కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామన్నారు.
ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా కాలయాపన చేయడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
CTR: గంటవూరు సమీపంలోని శనీశ్వరాలయం వద్ద ఉన్న ఓ దుకాణంలో దొంగ బీభత్సం సృష్టించాడు. బైక్పై హెల్మెట్, మాస్కుతో వచ్చిన అగంతకుడు షాపులో సిగరెట్ కావాలని అడిగి, యజమాని జ్యోతి మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో దొంగ ఆమె చెవిని తుంచి కమ్మలు, మాటీలు (14గ్రా) లాక్కెళ్లాడు. తీవ్ర రక్తశ్రావమైన బాధితురాలికి ఐదు కుట్లు పడ్డాయి.
KNR: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈనెల 24న జాబ్ మేళాను KNR ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి తెలిపారు. ఫ్లిప్ కార్ట్, ఈకార్ట్ KNR సంస్థలో 20 డెలివరీ బాయ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హతలు- 10వ తరగతి ఉత్తీర్ణులై, వయసు 18- 35 మధ్య ఉండాలన్నారు. నెలకు 22500, 30000 వరకు జీతం వస్తుందన్నారు.
ELR: ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.
PDPL: రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు. 8 ఇంక్లైన్ సిర్కే బస్టాండ్ వద్ద రోడ్డు భద్రత నియమాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి హనం వాహనాలు నడపవద్దని సూచించారు. పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.