TG: MIM కీలక నేతలు ఓవైసీ బ్రదర్స్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి 15 నిమిషాలు ఇస్తే హిందువులు లేకుండా చేస్తాను అన్నారని గుర్తు చేశారు. వారికి 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు ఇచ్చినా ఏం చేయలేరని ఎద్దేవా చేశారు. కానీ, తమకు ఐదు నిమిషాలు ఇచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎక్కడకి రావాలో చెప్పు అని సవాల్ విసిరారు.
SRCL: వేములవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలు నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతికుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్ సవాల్ విసిరారు. వేములవాడలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వేములవాడలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనరసింహారావుపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు.
సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మల్లాకాల్వ గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన ప్రతిష్ఠాపన వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని చెప్పాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానని, టీం అంతా షాక్ అయిందని అన్నాడు. ఫ్లైట్లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ‘మీరు మాములు వాళ్లు కాదండి అన్నాడు’ అని చెప్పాడు.
WGL: లంబాడ బంజారా ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు బంజారా జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, డీకే తేజస్విని పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముతామని చెప్పి రూ.60 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశారని శుక్రవారం బాధితుడుఆరోపించారు. కే. అమర్నాథ్ 2022 నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని వాపోయారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రధానంగా చిన్నారుల పుట్టు వెంట్రుకలు, ఇతర శుభ కార్యాల సందర్భంగా రద్దీ ఏర్పడింది. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూల్లో పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ నగరంలోని ఫిల్టర్ బెడ్ వద్దగల 14 MLD సామర్థ్యంగల నీటి సరఫరా వాల్వ్ మరమ్మతుల కారణంగా ఈనెల 24వ తేదీ (మంగళవారం)న నగరం అంతటా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని, నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు.
GNTR: రాజధానిలో రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. 96.2 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రూపొందుతున్న ఈ రహదారిని 8+4 వరుసలుగా డిజైన్ చేశారు. ఇందులో ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉండగా, స్థానిక రవాణా అవసరాల కోసం అదనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
SKLM: సారవకోట(మం) తల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం దాస్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.
NZB: నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం 31వ వార్డులో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి స్రవంతి పాల్గొని చిన్న పిల్లలకు అన్నప్రాసన, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరి, సహాయకులు సునీత, బస్తీ వాసులు పాల్గొనారు.
VSP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. 85 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 81,001 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేంద్రాల వద్ద బందోబస్తు, 144 సెక్షన్ అమలు, వైద్య శిబిరాలు, తాగునీరు, అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
కృష్ణా: పార్లమెంట్లో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం పాల్గొనారు. ఈ సమావేశంలో స్కిల్ ఎక్కువైజేషన్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి విధి నిర్వహణ కమిటీపై కమిటీ సభ్యులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు మేలు చేపడుతుందని పేర్కొన్నారు.